ANDHRA PRADESHCRIME NEWS

ఈతకు వెళ్లి మృత్యువడికి

ఈతకు వెళ్లి మృత్యువడికి

ఐదు మంది చిన్నారులను కబలించిన మల్లేపల్లి
చెరువు

బ్రహ్మంగారి మఠం మండలంలో విషాదం

బద్వేలు ప్రతినిధి మే 14 యువతరం న్యూస్:

చిన్నారులు వేసవి సెలవుల్లో ఆనందంగా గడుపుతామని బంధువుల ఊర్లకు వచ్చారు అక్కడ సరదాగా ఈతకు చెరువు కెళ్ళి అందులో గల్లంతయ్యారు ఈ విషాద ఘటన కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి చెరువులో మంగళవారం సాయంత్రం జరిగింది పోలీసులు బాధితుల చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం భోదనం గ్రామానికి చెందిన సుబ్బయ్య కుమారులు చరణ్
15 పార్థు 12 వేసవి సెలవుల కు అవ్వగారి గ్రామం బ్రహ్మంగారి మఠం మండలం మల్లెపల్లెకు రావడం జరిగింది అలాగే జమ్మలమడుగు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన రామకృష్ణ కుమారుడు హర్ష 12 తన మేనత్త ఇంటికి వచ్చాడు కాశి నాయన మండలం మల్లేరు కొట్టాలు గ్రామానికి చెందిన నారాయణ కుమారుడు తరుణ్ యాదవ్ 10 తన పెద్దనాన్న ఇంటికి రావడం జరిగింది వీరితోపాటు మల్లెపల్లి గ్రామానికి చెందిన తరుణ్ యాదవ్ కుమారుడు దీక్షిత్ 12 కలిసి మంగళవారం మధ్యాహ్నం మల్లేపల్లి సమీపంలోని చెరువుకు ఈతకు వెళ్లారు సాయంత్రం ఆరు గంటలు దాటుతున్న పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళన చెందారు గ్రామ సమీపంలో ఉన్న చెరువు వద్దకు వెళ్లి చూడగా
చెరువు ఒడ్డున పిల్లల దుస్తులు చెప్పులు ఉన్నాయి విషయం పోలీసులకు తెలపడంతో మైదుకూరు డిఎస్పి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో మైదుకూరు సీఐ బ్రహ్మంగారిమఠం ఎస్సై ఫైర్ సిబ్బంది చెరువు వద్దకు వచ్చి మోటార్ల సాయంతో చెరువులోని నీళ్లను తోడేశారు మంగళవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో ఐదు మంది చిన్నారుల మృత దేహాలు బయటపడ్డాయి మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ బాధితులను పరామర్శించి వారిని ఓదార్చారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!