అల్లూరి సీతారామరాజు ఒక పోరాట స్ఫూర్తి

అల్లూరి సీతారామరాజు ఒక పోరాట స్ఫూర్తి
సమాజం కోసం ప్రాణాలు అర్పించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు కలెక్టరేట్ మే 08 యువతరం న్యూస్:
అల్లూరి సీతారామరాజు ఒక పోరాట స్ఫూర్తి అని, వారి ధైర్య సాహసాలు యువతకు ఆదర్శనీయం అని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కొనియాడారు.బుధవారం అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్బంగా కలెక్టరేట్ మిని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని. ఆయన జరిపిన పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమన్నారు. సమాజం కోసం ప్రాణాలు అర్పించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని చాటుకున్న విప్లవ వీరుడన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత కలిగి ఉండాలన్నారు. అల్లూరి సీతారామరాజు ను ఆదర్శంగా తీసుకొని దేశ, సమాజ సేవలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలన్నారు. అల్లూరి సీతారామరాజు చరిత్రను విద్యార్థులు అంతా తప్పకుండా తెలుసుకోవాలని , అల్లూరి స్ఫూర్తి ని ఆదర్శంగా తీసుకుని నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవాలని కోరారు. అల్లూరి సీతారామరాజు 1897 సంవత్సరం లో జన్మించి కేవలం 27 ఏళ్లు మాత్రమే జీవించి సమాజం కోసం ప్రాణాలు అర్పించారని తెలిపారు.దేశం కోసం, అడవి బిడ్డల సంక్షేమం కోసం పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అన్నారు. అప్పట్లో బ్రిటిష్ వారు మన్యంలో ఉన్న గిరిజనులను ఎన్నో ఇబ్బందులకు గురిచేసేవారని, అడవి లో ఉండే ఉత్పత్తులు సేకరించి అమ్ముకునే వారిపై దమనకాండ చేస్తుండగా బ్రిటిష్ వారిపై వివిధ రకాలుగా పోరాడి వారికి విముక్తి కల్పించిన వ్యక్తి అల్లూరి అన్నారు. ఆయన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశ యువత ముందుకు సాగాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ , సిపిఓ హిమప్రభాకర్ రాజు, కలెక్టరేట్ ఏఓ విజయశ్రీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిరంజీవి, జిల్లా టూరిజం అధికారి విజయ, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.