ANDHRA PRADESHCRIME NEWS

పసి పిల్లలపై బ్యాడ్ టచ్ జరిగితే తీసుకోవాల్సిన చర్యలపై ఆడియో, వీడియో సిడి ఆవిష్కరణ

పసిపిల్లలపై బ్యాడ్ టచ్ జరిగితే తీసుకోవాల్సిన చర్యలపై ఆడియో , వీడియో సి.డి ని ఆవిష్కరణ చేసిన కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్

లైంగిక దాడులను అరికట్టడమే లక్ష్యం

కర్నూలు ప్రతినిధి జనవరి 9 యువతరం న్యూస్:

నేరాల నివారణే లక్ష్యం.
ఎవరైనా లైంగిక నేరాలకు పాల్పడితే వెంటనే డయల్ 100 కు గాని, డయల్ 112 కు గాని పిర్యాదు చేయండి.
మిడియా వారికి , జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన… జిల్లా ఎస్పీ .
లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతోనే అవగాహన కు ఆడియో, విడియో సిడి ని విడుదల చేశామని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ తెలిపారు. ఈ సంధర్బగా జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో బ్యాడ్ టచ్ జరిగితే తీసుకోవాల్సిన చర్యల పై ఆడియో , వీడియో సి.డి ని జిల్లా ఎస్పీ ఆవిష్కరణ చేశారు.
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ….
చాలా చోట్ల చిన్న పిల్లల పై లైంగిక దాడులు జరుగుతున్నాయన్నారు.
పసిపిల్లలు బాడ్ టచ్ జరిగినప్పుడు సమాజానికి భయపడి , తల్లితండ్రులకు చెబితే వారు తిడితారేమో అని, చదువుమానిపిస్తారెమో అని భయపడకుండా డయల్ 100 కు గాని, డయల్ 112 కు గాని పిర్యాదు చేయాలన్నారు.
టీనేజ్ పిల్లలు ఇంట్లో చెబితే చదువు తల్లిదండ్రులు మాన్పిస్తారెమో అని భయపడి చెప్పడంలేదన్నారు. ధైర్యంగా తల్లిదండ్రులకు గాని, టీచర్లకు గాని, పోలీసులకు గాని తెలియజేయాలన్నారు.
పోలీసులకు సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.
బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
5 నిమిషాల విడియో ద్వారా చిన్న పిల్లలకు అవగాహన కల్పించేందుకు కర్నూలు పోలీసులు చర్యలు చేపట్టారన్నారు.
పాఠశాలలలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మహిళల పై నేరాలు, సైబర్ నేరాలు జరగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
మీడియా వారు కూడా తమ వంతుగా పోలీసులకు సహాకారం అందించాలన్నారు.
ఈ బ్యాడ్ టచ్ విడియోను మీడియా లో బాగా పబ్లిసిటి వచ్చే విధంగా చూడాలన్నారు. చిన్న పిల్లల కు అవగాహన కల్పించాలన్నారు. మిడియా వారికి , జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. బ్యాడ్ టచ్ అవగాహన కార్యక్రమం లో ముఖ్యపాత్ర వహించి కృషి చేసిన కోడుమూరు సిఐ తబ్రేజ్ , సంగీత దర్శకులు ఫయూమ్ , గాయకుడు కరీముల్లా, డ్యాన్సర్స్, నటీనటులు, పోలీసులు, విద్యార్దులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మన్ జి. హుస్సేన్ పీరా, కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్, కర్నూలు పట్టణ సిఐలు , ఎస్సైలు , మహిళా పియస్ సిబ్బంది, పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!