
గడపగడపకు బిజెపి
వాజేడు యువతరం విలేఖరి;
మండలంలోని ధర్మారం గ్రామంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరు సతీష్ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ పరిపాలన గురించి బుధవారం గడపగడపకు తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం జరిగినది. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ బిజెపితోనే అభివృద్ధి సాధ్యమన్నారు. మోడీ వల్ల దేశం అభివృద్ధి వైపు నడుస్తుందన్నారు. రాష్ట్రాల అభివృద్ధి బిజెపితోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో వాజేడు మండల ఓబీసీ అధ్యక్షుడు బొల్లె వెంకటేశ్వర్లు, ఎస్సీ మోర్చా కావిరి నరసింహారావు, వెంకటాపురం ఎంపీటీసీ రా మెల్ల రాజశేఖర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.