ANDHRA PRADESHBREAKING NEWSCRIME NEWSHEALTH NEWSLIVE TVMOVIESPOLITICSSOCIAL MEDIASPORTS NEWSSTATE NEWSTELANGANA

పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో మెగా జాబ్ మేళా

పత్తికొండ, జూన్ 13,  (యువతరం న్యూస్) :

పత్తికొండ నియోజక వర్గ రెవెన్యూ డివిజన్ పరిధి లోని పత్తికొండ పట్టణం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణ లో జరిగిన మేగా జాబ్ మేళా కార్యక్రమాన్ని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ప్రారంబించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూల్ జిల్లా నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగం అధికారి ఆధ్వర్యంలో పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో జరిగిన మెగాజాబ్ మేళాలో పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ, కర్నూలు జిల్లా డిఆర్డిఏ పిడి, డిస్టిక్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారి, పత్తికొండ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ తో కలసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో పత్తికొండ వై.సి.పి ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ మాట్లాడుతూ మెగా జాబ్ మేళాలో హేటరో,టీసీల్,అరబిందో ఫార్మా , ఫ్లిప్ కార్డ్, డిమార్ట్, శ్రీరామ్ చిట్స్ లైఫ్ ఇన్సూరెన్స్, నవభారత్ ఫర్టిలైజర్స్ లాంటి దిగ్గజ కంపెనీలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని, వీటిని పత్తికొండ ప్రాంత యువతీ యువకుల సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, ఎంపీపీ మరియు వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!